హైదరాబాద్ : పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న బెంగతో యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని బంజారాహిల్స్పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. కృష్ణానగర్కు చెందిన టీ కావ్య(22) తల్లిదండ్రులతోపాటు ఇద్దరు చెల్లెల్లతో కలిసి ఉంటున్నది. గతేడాదిగా తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన రెండు సంబంధాలు తిరస్కరణకు గురికావడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది.
దీంతో శుక్రవారం తన గదిలో దుప్పటి సాయంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది. అపస్మారక స్థితికి చేరిన కావ్యను కుటుంబీకులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.