వాడపల్లిలో అస్థికల నిమజ్జనం బంద్
కరోనా నేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు, పురోహితుల తీర్మానం
మఠంపల్లి, మే 9 : మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామికి అన్నిరకాల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్కుమార్, ఈఓ నవీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు విధిగా మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
వాడపల్లిలో అస్థికల నిమజ్జనం బంద్
పదిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు పురోహితుల తీర్మానం
దామరచర్ల, మే 9 : వాడపల్లిలోని కృష్ణా, మూసీ నదుల సంగమం వద్ద ఆదివారం నుంచి అస్థికల నిమజ్జనం నిలిపివేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో అస్థికల పూజలు నిర్వహించే పురోహితులు మూకుమ్మడిగా పదిరోజులపాటు పూజలు నిలిపివేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు అధికంగా కరోనా వ్యాధితో చనిపోయిన వారి అస్థికల నిమజ్జనం కోసం వస్తున్నందును పూజార్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేస్తున్న క్రమంలో వైరస్ ప్రబలే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.