ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
మాడ్గులపల్లి, మే 9 : చెక్డ్యామ్ల నిర్మాణంతో దండిగా వ్యవసాయ సాగు పెరుగుతుందని మిర్యాలగూడె ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండలంలోని బొమ్మకల్లు గ్రామ పరిధిలోని పాలేరు వాగుపై నీటి పారుదల శాఖ నుంచి మంజూరైన రూ.3.95కోట్లతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెక్డ్యాం నిర్మాణం పూర్తయితే బొమ్మకల్లు, భీమనపల్లి, చర్లగూడెం గ్రామాల పరిధిలోని సుమారు 700 ఎకరాల్లో భూమి సాగులోకి వస్తుందన్నారు. చెక్డ్యామ్లో నీటి నిల్వతో భూగర్భజలాలు వృద్ధి చెంది బోర్లు, బావుల్లో నీటి లభ్యత గణనీయంగా పెరుగుతుందన్నారు. ఏళ్ల తరబడి ఈ గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న చెక్డ్యామ్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మోషిన్ అలీ, ఎంపీపీ పోకల శ్రీవిద్య, సర్పంచులు మారుతి వెంకట్రెడ్డి, మేక లింగమ్మ, వేములపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాములుగౌడ్, పాములపహాడ్ ఎంపీటీసీ కళింగారెడ్డి, ఈఈ ఎలమందయ్య, డీఈ జనార్దన్, సిబ్బంది నర్సింహ తదితరులు పాల్గొన్నారు.