ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం
ఎంపీడీవో కార్యాలయంలో విచారణ
పెంచికల్పేట్, మే 5 : ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ రాజేశం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం నిర్వహణలో అవకతవకలు జరిగాయని కొందరు రైతులు ఫిర్యాదు చేశారని, దీంతో అధికారుల సమక్షంలో విచారణ చేయగా అవకతవక లు జరిగాయని నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఇందుకు బాధ్యులైన ప్రాథమిక సహకార సంఘం సీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ ని, అలాగే కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 6 నుం చి ఐకేపీ వారికి అప్పగిస్త్తూ ఆదేశాలను జారీచేశామన్నారు. రైతులు దళారులను నమ్మి నష్టపోవద్ద ని సూచించారు.నాణ్యమైన ధాన్యం తీసుకువ చ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు వివరాలను ట్యాబ్లో నమోదు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. అదే విధంగా ఈ యేడు కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ప్రోటోకాల్ పాటించలేదని పలువురు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారన్నా రు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, ఎంపీపీ జాజిమొగ్గ సుజా త, జడ్పీటీసీ సముద్రాల సరిత, తహసీల్దార్ అనంతరాజు, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్లు జాజిమొగ్గ శ్రీనివాస్, సంజీవ్, మండల కోఆప్షన్ స భ్యుడు సాజీద్, రైతు బంధు సమితి అధ్యక్షుడు చౌదరి తిరుపతి, నాయకులు సముద్రాల రాజన్న, బండు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.