సెల్ఫ్ లాక్డౌన్ దిశగా నిర్ణయాలు
నేటి నుంచి మూడు చోట్ల అమలు
నర్సంపేటలో మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్
పరకాలలో ఒంటిగంట వరకే షాపులు
వర్ధన్నపేటలో 2 తర్వాత మూసివేత
స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలు
వరంగల్రూరల్, మే 5(నమస్తేతెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేసేందుకు పల్లెల్లో మాదిరిగా పట్టణాలు కూడా సెల్ఫ్ లాక్డౌన్ అమలుకు నిర్ణయం తీసుకుంటున్నాయి. జిల్లాలోని మూడు మున్సిపాలి టీల పరిధిలోనూ గురువారం నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించేందుకు పురపాలికలు తీర్మానించాయి. దీంతో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మధ్యాహ్నం తర్వాత వ్యాపార, వాణిజ్య సం స్థలు మూతపడనున్నాయి. అత్యవసర సర్వీసులైన మెడికల్ షాపుల వంటివి మాత్రమే పనిచేయనున్నా యి. ఇప్పటికే వరంగల్ రూరల్ జిల్లాలో పర్వతగిరి, సంగెం, నెక్కొండ, ఖానాపురం, ఆత్మకూరు, దామెర, శాయంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట తదితర మం డలాల్లోని పలు గ్రామాల్లో కొద్దిరోజుల నుంచి ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇక్కడ స్థానిక జీపీ పాలకవర్గం నిర్ణయించిన వేళల ప్రకారం వ్యాపార, వా ణిజ్య సంస్థలు ప్రతి రోజూ కొన్ని గంటలే పనిచేస్తున్నా యి. నిర్ణీత వేళల్లో గాకుండా ఇతర సమయాల్లో దుకా ణం తెరిచిన వ్యాపారులకు జరిమానా విధిస్తున్నారు. అధికారులు కూడా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్న లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా రాయపర్తి మండల కేంద్రంలో గురువారం నుంచి సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పా లకవర్గం తీర్మానించింది.
మూడు మున్సిపాలిటీల పరిధిలో..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో గురు వారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమల్లోకి రానుం ది. బుధవారం నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశమై ఈ నెల 6వ తేదీ నుంచి సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలని ప్రజలను కోరుతూ తీర్మానించింది. మ ధ్యాహ్నం 12 గంటల తర్వాత వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయాలని, మెడికల్ వంటి అత్యవస ర సర్వీసులైన షాపులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పరకాల మున్సిపాలిటీ పరిధిలోనూ గురు వారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ పాటించనున్నారు. స్థానిక ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శేషాంజ న్స్వామితో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ ప్రకట న చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం వర్ధన్నపేట మున్సి పాలిటీ కార్యాలయంలో వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానుల సంఘాల ప్రతినిధులతో కమిషనర్ గొడిశాల రవీందర్, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎస్సై వంశీకృష్ణ సమావేశమై లాక్డౌన్ అమలు ప్రకటన చేశా రు. గురువారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని తీర్మానించి నట్లు వెల్లడించారు.
పరిస్థితిపై ఎమ్మెల్యేల సమీక్ష
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు బుధవారం నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్, నివారణ చర్యలపై చర్చించారు. వైరస్ వ్యాప్తి చెంద కుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచన లు చేశారు. నర్సంపేట ఏరియా దవాఖానలో అవస రాన్ని బట్టి అదనపు వైద్య సిబ్బందిని పెంచాలని ఎమ్మె ల్యే పెద్ది వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చెప్పారు. వైరస్ సోకిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందించాలని, కండీషన్ సీరియస్గా ఉన్న పేషెంట్లను వరంగల్ ఎంజీఎం హా స్పిటల్కు లేదా అత్యాధునిక సౌకర్యాలు ఉన్న వైద్య శాలలకు తరలించాలని అన్నారు. గ్రామాల్లో ఎవరికై నా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక ఏఎన్ఎం లేదా ఆశ వర్కర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు. కరోనా సోకిన వారిని ఇంట్లో, దవాఖానలో ఉండలేని వారికోసం పరకాలలోని మల్లక్కపేట రెసిడెన్షియల్లో ప్రభుత్వం కేర్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.