ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ బయో బబుల్లోకి కరోనా మహమ్మారి వ్యాప్తించడంతో లీగ్ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. లీగ్ అర్ధాంతరంగా రద్దు కావడంతో దేశీయ ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఐతే దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో భారత ప్రయాణికుల రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో పాల్గొనడానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లను తమ స్వదేశాలకు పంపించడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు. ఆటగాళ్లను సురక్షితంగా తమ ఇంటికి తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మంగళవారం మధ్యాహ్నం టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.