ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జైశ్వాల్(12) ఔటయ్యాడు. వరుసగా రెండు ఫోర్లు బాదిన జైశ్వాల్ అదే ఓవర్ ఆఖరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాతి ఓవర్లలో జోస్ బట్లర్,సంజూ శాంసన్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. పవర్ప్లే ఆఖరికి 42/1తో నిలిచింది. విజయ్ శంకర్ వేసిన ఏడో ఓవర్లో బట్లర్, శాంసన్ చెరో సిక్స్ కొట్టి 18 రన్స్ రాబట్టారు. 7 ఓవర్లకు రాజస్థాన్ వికెట్నష్టానికి 60 పరుగులు చేసింది. శాంసన్(15), బట్లర్(26) క్రీజులో ఉన్నారు.