హైదరాబాద్ : కారు ఢీకొని దుర్ఘటనలో 11 నెలల బాలుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన నగరంలోని గచ్చిబౌలిలో మంగళవారం చోటుచేసుకుంది. కొండాపూర్లోని శ్రీనగర్కాలనీ గల ఇంటి ముందు బాలుడు ఆడుకుంటున్నాడు. కాగా అదేసమయంలో ఓ కారు వేగంగా వచ్చి బాలుడిని ఢీకొంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా బాలుడు మృతిచెందాడు. నిందితుడిని కొండాపూర్కు చెందిన తాటి కిరణ్(32)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.