పెద్దపల్లి : లబ్దిదారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంగళవారం కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల తహశీల్ధార్ కార్యాలయంలో 32 మంది లబ్దిదారులకు రూ. 32,03,712/- విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న బాల్క సుమన్ ఎన్హెచ్-63 నుండి చెన్నూర్ వెళ్లే మార్గంలో వరలక్ష్మీ కాటన్ మిల్లు సమీపంలో రూ. 3.50 కోట్లతో నిర్మించనున్న నూతన బ్రిడ్జీ (డబుల్ లైన్) పనులకు శంకుస్థాపన చేశారు.