అమృత్సర్: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా పంజాబ్లోని పాటియాలా నగరంలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. ఇద్దరు దొంగలు ఓ వృద్ధురాలిని చంపి ఇంట్లోని నగదు, నగలు దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నదని పసిగట్టిన ఇద్దరు నిందితులు ఆ ఇంటిపై కొన్ని రోజులు నిఘా వేశారు. శనివారం ఆ ఇంట్లో కేవలం ఒక వృద్ధురాలు మాత్రమే ఉన్న సమయం చూసి చొరబడ్డారు. వెళ్లడంతోనే వృద్ధురాలి గొంతునులిమి చంపేసి.. ఆ ఇంట్లోని నగదు, నగలను తీసుకుని పారిపోయారు.
అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. కొంతమంది పోలీసులు బృందాలు ఏర్పడి ముమ్మరంగా గాలించారు. దాంతో 24 గంటల లోపలే దొంగలు పోలీసులకు చిక్కారు. పట్టుబడ్డ దొంగల నుంచి పోలీసులు రూ.40 లక్షల విలువైన నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
మమతాజీ.. బెంగాలీలు ఎవరికీ భయపడరు: జేపీ నడ్డా
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు