కొండాపూర్, ఏప్రిల్ 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్.శరత్ జ్యోత్స్నా రాణి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ ప్యానెల్ మెంబర్గా ఎంపికైనట్లు వర్సి టీ యాజమాన్యం శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ రీజియన్ బోర్డు మెంబర్గా శరత్ జ్యోత్స్నా రాణిని నియమిస్తూ భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రొఫెసర్ రాణి రెండేళ్ల పాటు సభ్యులుగా కొనసాగనున్నారని, బోధనలో ఆమెకు 32 యేళ్ల అనుభ వం ఉందని, ఇప్పటికే 32 మంది పీహెచ్డీ విద్యార్థులను, 50 మంది ఎంఫిల్ విద్యార్థులకు గైడ్గా వ్యవహరించినట్లు తెలిపారు. 200లకు పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారని, 1996 నుంచి ఇప్పటివరకు పలు సాహితీ పురస్కారాలను అందుకున్నట్లు తెలిపారు.