మేడ్చల్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ఈనెల 24న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. వరి కోతుల పూర్తయ్యే వరకు ధాన్యం కొంటామని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13,579 ఎకరాల్లో వరిసాగు చేయగా 33వేల 948 మెట్రిక్ టన్నుల దిగుబడులను అధికారులు అంచనా వేసి ఆ దిశగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. కొనుగోలు కేంద్రాలను ఈనెల 24న మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను ఈనెల 24న ప్రారంభిస్తున్నాం. వరి విస్తీర్ణం దిగుబడుల అంచనాల మేరకు 12 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోతలు పూర్తయ్యే వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయి. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతై అదనంగా గ్రామాల్లో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – మంత్రి మల్లారెడ్డి