ప్రస్తుతం భారత్ను కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. రోజురోజుకీ కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కరోనాను ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడికి ప్రార్థనలు చేస్తోంది బాలీవుడ్ భామ బిపాసాబసు. బ్లూ డ్రెస్ లో ఉన్న బిపాసాబసు ఛైర్ లో కూర్చొని ప్రార్థనలు చేస్తున్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు అవసరం అని క్యాప్షన్ ఇచ్చింది. బిపాసాబసు ఇటీవలే 2001లో తన డెబ్యూట్ చిత్రం అజ్నబీ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..ఇది తనకు చాలా ప్రత్యేకమని పోస్ట్లో పేర్కొంది. తెలుగులో మహేశ్ బాబు హీరోగా నటించిన టక్కరి దొంగలో హీరోయిన్ గా మెరిసింది బిపాసా. గతేడాది డేంజరస్ వెబ్సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ