గాజులరామారం/ కుత్బుల్లాపూర్ , ఏప్రిల్ 10 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు జీహెచ్ఎంసీ ద్వారా మంజూరైన 11 స్వచ్ఛ ఆటోలను శనివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం లో జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఒక్కో స్వచ్ఛ ఆటో ప్రతి రోజూ 600 ఇండ్ల నుంచి చెత్త సేకరిస్తుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకుని ఖాళీ స్థలాల్లో చెత్తను వేయకుండా ఇంటి వద్దకు వచ్చే ఆటోల్లో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీలు రవీందర్కుమార్, మంగతాయారు, కార్పొరేటర్లు కొలుకుల జగన్, బి.విజయ్శేఖర్గౌడ్, రఫీదాబేగం, సీనియర్ నాయకులు సురేశ్రెడ్డి, ఏఎంఓహెచ్లు ప్రశాంతి, భానుచందర్, ఎస్ఎస్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. శనివారం జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేజ్ 5లో ఉన్న ఆంధ్ర పాలిమర్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్కేవీ జెండాను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంగా ఉండి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే యాజమాన్యాలతో చర్చలు జరిపి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుడిమెట్ల సురేశ్రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, నాయకులు శ్రీనివాస్, రాజు, డి.రఘు, రవికిరణ్, రమేశ్ పాల్గొన్నారు.