హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అస్వస్థతకు గురయ్యారు అని కొన్ని టీవీ చానల్స్ లో వార్తలు రావడం అవాస్తవం అని ఆయన పీఆర్వో తెలిపారు. స్పీకర్ పోచారం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు ఎటువంటి సమస్యలు లేవు అని స్పష్టం చేశారు.
ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగులోకి నీటి విడుదల కార్యక్రమంలో స్పీకర్ పోచారం హుషారుగా పాల్గొన్నారు. తదుపరి కార్యక్రమాల్లో యదావిధిగా పాల్గొంటున్నారు. సన్నిహితులు, అభిమానులు, మిత్రులు, మీడియా ప్రతినిధులు ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని, అనవసర వార్తలను ప్రసారం చేయొద్దని పీఆర్వో విజ్ఞప్తి చేశారు.