కోల్కతా : దేశమంతా నందిగ్రామ్ వైపే చూస్తోందని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి తెలిపారు. రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో సువేందు అధికారి తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారు అని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశమంతా నందిగ్రామ్ వైపే చూస్తోంది కాబట్టి.. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ కూడా చదవండి..