భారీగా తరలివచ్చిన భక్తులు
ములుగురూరల్, మార్చి 28 : మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట జాతర ఆదివారం ముగిసింది. గుట్టపై ఉన్న ఆలయంలో లక్ష్మీనర్సింహుడికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దూరాన్ని లెక్కచేయకుండా అడవి మార్గంలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు రావడంతో అటవీ ప్రాంతం, ఆలయ పరిసరాలు నూతన శోభను సంతరించుకున్నా యి. ఆర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దంపతుల వారీగా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఎ లాంటి అసౌకర్యాలు కలు గకుండా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇండ్ల అశోక్, ఉపాధ్యక్షుడు బండి మధు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. కాగా, స్వామివారికి గ్రామ సర్పంచ్ పారిజాతంతోపాటు ఎంపీటీసీ మాసిపెద్ది పుషమ్మ-సత్యం దంపతులు పూజలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంటమూరి భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ కార్యదర్శి తక్కళ్లపల్లి కిషన్రావు, ప్రధాన కార్యదర్శి అక్కల పో శాలు, కోశాధికారి కూచ శ్రీను, సహాయ కార్యదర్శి కృష్ణ, ప్రచార కార్యదర్శి రమేశ్, సభ్యులు బా నోత్ రమేశ్, బండి రమేశ్, గట్ల సమ్మ య్య, అల్లెం స్వామితోపాటు గ్రామస్తులు వీరమనేని కిషన్రావు, తక్కళ్లపల్లి కిషన్రావు, కంచ కృష్ణ, అమ్మ అయిలయ్య, కుమార్ పాల్గొన్నారు.