బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెల్లమెల్లగా తన కెరియర్ను బిల్డప్ చేసుకుంటుంది. ఇటీవల రూహి అనే క్రైమ్ అండ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ
చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. పంకజ్ మట్టా రచయిత కాగా.. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు.మరో వైపు దోస్తానా 2 లోనూ జాన్వీ నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఓ నెటిజన్ మనం ముద్దు పెట్టుకుందామా అని ప్రశ్నించగా, దానికి మాస్క్తో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ నో అని ఆన్సర్ ఇచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ముద్దులకు చోటు లేదు అన్నట్టుగా జాన్వీ సమాధానం ఇచ్చింది. మరొకరు డైట్ గురించి ప్రశ్నిస్తే.. చేతిలో ఒక కప్పు ఐస్ క్రీంతో తన ఫోటోను పంచుకుంది. ఇష్టమైన హీరో ఎవరు అంటే .గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సహనటుడు పంకజ్ త్రిపాఠిని హగ్ చేసుకున్న పిక్ షేర్ చేసింది జాన్వీ. ఈ మధ్య జాన్వీ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి ప్రతి రోజు హెడ్ లైన్స్లో నిలిచిన విషయం తెలిసిందే.