హైదరాబాద్: గురుగ్రామ్లో మాంసాన్ని అమ్మవద్దు అంటూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మాంసం అమ్మకందార్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని ఆయన ఆరోపించారు. ముస్లిమేతర వ్యాపారులు కూడా నష్టపోతారన్నారు. రాజ్యాంగం ప్రకారం కాకుండా, ఒకవేళ విశ్వాసం మీదే దేశం నడిస్తే అప్పుడు శుక్రవారం మద్యాన్ని నిషేధించాలంటూ ఎంపీ అసద్ తెలిపారు.