దళిత బస్తీ ద్వారా అండగా నిలుస్తున్నాం..
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
56 మంది లబ్ధిదారులకు 113 ఎకరాలు పంపిణీ
తాంసి, మార్చి 19 : దళితబస్తీ ద్వారా ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల సాగుభూమిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం తాంసి మండలం జామిడి, ఘోట్కూ రి, తాంసి(బి) గ్రామాలకు చెందిన 56 మంది దళిత మహిళలకు (113 ఎకరాలకు సంబంధించిన) పట్టా పాసుపుస్తకా లను శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు. అలాగే పట్టాదారులకు రూ.5.80 కోట్ల విలువైన చెక్కులను అందించారు. అ నంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. దళితులకు భూ పంపిణీ పథకంలో బోథ్ నియోజకవ ర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు. భూమి పొందిన లబ్ధిదారులకు పెట్టుబడిసాయం, బోరుబావి, కరం ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మిగతా దళిత కుటుంబాలకు కూడా త్వరలోనే భూమి అందజేస్తామని హామీఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురుకుంటి మంజులా శ్రీధర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, సర్పంచ్లు కృష్ణ, కేశవ్రెడ్డి, సదానందం, ఎంపీటీసీలు రఘు, అశోక్ పాల్గొన్నారు.