దంగల్ సినిమాతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది సన్యామల్హోత్రా. ఆ తర్వాత బఢాయి హో, శకుంతలాదేవి, లూడో వంటి డిఫరెంట్ స్టోరీస్తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ తాజాగా పగ్లెయిట్ అనే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా చేస్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. బావోద్వేగాల సమ్మేళనంతో కామెడీ టచ్ ఇస్తూ సంధ్య మహిళ చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
సంధ్య పెండ్లి చేసుకున్న ఐదు నెలలకే భర్త చనిపోతాడు. కానీ భర్త మరణించాడన్న బాధ సంధ్యలో కనిపించదు. భర్త చనిపోయిన తర్వాత సంధ్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. సీరియస్ కథాంశాన్ని డైరెక్టర్ ఉమేశ్ భిష్ట్ సున్నితంగా, ఫన్ టచ్ ఇస్తూ ప్రేక్షకులకు అందించబోతున్నాడు.
శోభాకపూర్, ఏక్తాకపూర్, గునీత్ మోంగ, అచిత్ జైన్, శృతి శర్మ, సయానీ గుప్తా, అశుతోష్ రానా, రఘువీర్ యాదవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హీరోయిన్ శృతిశర్మ కీ రోల్లో కనిపించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.