లేకపోతే సర్పంచ్లు, అధికారులపై చర్యలు
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
పనుల పరిశీలన
బెల్లంపల్లి రూరల్, మార్చి 15 : బెల్లంపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న శ్మశానవాటికలు, డంప్యార్డుల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీడీవో విజయలక్ష్మిని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. మండలంలోని కన్నాల, చాకెపల్లి, సోమగూడెం పంచాయతీల్లో శ్మశానవాటికలు, డంప్యార్డుల పనులను పరిశీలించారు. ఈజీఎస్ కింద చేపడుతున్న నర్సరీలను సందర్శించారు. ఈ నెల 22వ తేదీ వరకు పనులు పూర్తిచేయకపోతే సంబంధిత సర్పంచ్లతో పాటు స్థానిక అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలకు నీళ్లను అందించి, కాపాడుకోవాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో విజయలక్ష్మి, ఈజీఎస్ ఏపీవో జీనత్, ఎంపీవో వీ శ్రీనివాస్, సర్పంచ్లు ప్రమీలాగౌడ్, జంబి సురేశ్, జిల్లపల్లి స్వరూప ఉన్నారు.