రామగిరి, మార్చి15 : విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు నిర్వహించిన 48వ జవహర్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్, గణిత, పర్యావరణ ప్రాజెక్టుల జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనలో పలువురు బాల శాస్త్రవేత్తలు ప్రతిభ చాటారు. కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ప్రదర్శనకు 83 ప్రాజెక్టులు నమోదు కాగా ఆరు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. సోమవారం ప్రదర్శన ఫలితాలను ఆయన విడుదల చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయి ఆన్లైన్ ప్రదర్శన వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతిని, లేదా సెల్ 98485 78845కు సంప్రదించాలని సూచించారు.