అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
1. శ్రీకాకుళం- 44.38
2. విజయనగరం – 45.10
3. విశాఖపట్నం -36.75
4. తూర్పుగోదావరి-53.08
5. పశ్చిమగోదావరి-45.51
6. కృష్ణా-41.49
7. గుంటూర్ – 44.69
8. ప్రకాశం-53.19
9. నెల్లూర్ – 48.89
10. చిత్తూర్-41.28
11. అనంతపురం -45.42
12. కడప-46.02
13. కర్నూల్-40.99