అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్ ధోనీ(60 టెస్టులు, 2008-2014) రికార్డును కోహ్లీ సమం చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న నాలుగో టెస్టు ద్వారా కోహ్లీ(60*) ఈ మార్క్ అందుకున్నాడు.
సౌరవ్ గంగూలీ(49 టెస్టులు), మహ్మద్ అజారుద్దీన్(47), సునీల్ గావస్కర్(47), పటౌడీ(40), కపిల్ దేవ్(34), రాహుల్ ద్రావిడ్(25), సచిన్ టెండూల్కర్(25), బిషన్ సింగ్ బేడీ(22) భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించారు. టీమ్ఇండియాకు అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో కోహ్లీనే నంబర్వన్గా ఉన్నాడు. ఇంగ్లాండ్తో మూడో టెస్టులో గెలవడం ద్వారా స్వదేశంలో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్గానూ కోహ్లీ నిలిచాడు.