ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
తహసీల్ కార్యాలయంలో విశ్రాంతి గది ప్రారంభం
రామడుగు, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన విశ్రాంతి గది, టాయ్లెట్స్, రెనోవేషన్ గదులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, అన్నదాతలను ఆదరించేందుకే తహసీల్ కార్యాలయంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తహసీల్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. త్వరలో డిజిటల్ సర్వే కూడా ప్రారంభమవుతుందన్నారు. కాగా, తహసీల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని చూసి తహసీల్దార్ కోమల్రెడ్డిని అభినందించారు. ఆవరణలోని గడికోటకు మువ్వన్నెల రంగులు వేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సెల్ఫీ తీసుకున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి తహసీల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ పంజాల ప్రమీల, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, నాయబ్ తహసీల్దార్ కిరణ్కుమార్రెడ్డి, ఆర్ఐ రజినీ, కొక్కెరకుంట సింగిల్విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్ అలీ, వైస్ ఎంపీపీ పూరెల్ల రాజ్గోపాల్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బండ అజయ్రెడ్డి, సర్పంచులు జవ్వాజి శేఖర్, నర్సయ్య, నాయకులు కలిగేటి లక్ష్మణ్, వీర్ల రవీందర్రావు, నాగుల రాజశేఖర్గౌడ్, గునుకొండ అశోక్, తౌటు మురళి, వీర్ల సంజీవరావు, లంక మల్లేశం, కొడిమ్యాల రాజేశం, భూత్కూరి సురేశ్, పైండ్ల మధు, జూపాక మునీందర్, తదితరులు పాల్గొన్నారు.