పల్లెల్లో పచ్చదనం పెంచడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా
సుల్తానాబాద్రూరల్, జూలై 16: ప్రతిఒక్కరూ ఊరూరా విరివిగా మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటలో శుక్రవారం సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలేటి హాజరై రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కోలేటి మాట్లాడుతూ, తెలంగాణలో పచ్చదనం పెంపునకే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేశారని చెప్పారు. ఈ హరితోద్యమంలో పోలీసుశాఖ పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్లో ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అన్ని పోలీస్స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో వారం రోజుల్లో రెండు లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఎంతో కష్టపడి దాదాపు 600 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్రావు, సిబ్బందిని ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్రావు, లక్ష్మణ్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ కాసర్ల అనంతరెడ్డి, సర్పంచులు రవీందర్రెడ్డి, వసంత మోహన్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్గౌడ్, కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు ముత్యం రమేశ్, గుర్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.