]
రెండు లక్షల పండ్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లి జంక్షన్, జూలై 15: ఈ నెల 24వ తేదీన ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు జన్మదిన కానుకగా ఇద్దామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయ ఆవరణలో ముక్కోటి వృక్షార్చన పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో ఒకే రోజు.. ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారని వివరించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి నియోజక వర్గంలో ప్రతి ఇంటికీ 3 పండ్ల మొక్కల చొప్పున అన్ని గ్రామాల్లో కలిపి రెండు లక్షలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా మొబిన్, ఆర్బీఎస్ సుల్తానాబాద్ మండల కోఆర్డినేటర్ అనంతరెడ్డి, పెద్దపల్లి పీఏసీఎస్ డెరెక్టర్ ఉప్పు రాజ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు అక్కపాక తిరుపతి, ఐలయ్య ఉన్నారు.
ప్రజల ఆరోగ్యమే ప్రథమం
ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతపై పెద్దపల్లి అమర్ చంద్ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పనులు నిర్వహిస్తున్నదని వివరించారు. ఇంట్లోని చెత్తను రోడ్లు, ఇతర ప్రదేశాల్లో పడేయకుండా పారిశుధ్య కార్మికులకు ఇచ్చేలా అధికారులు, మెప్మా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ప్రతి ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్ల, పూల మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు పైడ పద్మ రవి, సరేశ్బాబు, దేవనంది రమాదేవి, పోతని పురుషోత్తం, కో-ఆప్షన్ సభ్యుడు ఫహీం, మెప్మా ఏడీఎంసీ మౌనిక, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు రాధ, మున్సిపల్ మేనేజర్ నయీంషా ఖాద్రీ, ఆర్ఐ శివప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ కరుణాకర్, సీఎల్ఆర్పీలు స్వప్న, శ్యామల తదితరులు పాల్గొన్నారు.