ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
2వ వార్డులో పర్యటన
పెద్దపల్లిటౌన్, జూలై 11: పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సూచించారు. 2వ వార్డులో ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాలనీలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను ఎక్స్కవేటర్ సహాయంతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. వార్డు పరిధిలో 50 మంది కార్మికులతో పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో దోమలు, ఈగలు పెరిగి జ్వరాలు వచ్చే ప్రమాదముందని వివరించారు. మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళికతో పనులు చేయాలని ఆదేశించారు. పలుచోట్ల ఎమ్మెల్యే స్వయంగా పిచ్చిమొక్కలు తొలగించారు. ఆయన వెంట కౌన్సిలర్ పస్తం హన్మంతు సిబ్బంది పాల్గొన్నారు.