పెద్దపల్లి జంక్షన్, జూలై 11: కుటుంబ నియంత్రణ(కు.ని) పద్ధతులు పాటిస్తూ జనాభా పెరుగుదలను అరికట్టాలని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణపై ఆదివారం పెద్దపల్లిలో అవగాహన ర్యాలీ తీశారు. అనంతరం డీఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్వో మాట్లాడుతూ, ‘కుటుంబ నియంత్రణకు సంసిద్ధత, సమర్ధవంతమైన దేశం, కుటుంబాల సంపూర్ణ బాధ్య త’ అనే నినాదంతో ముందుకు పోదామని వివరించారు. జనాభా పెరుగుదల నియంత్రణకు వి వాహాలు ఆలస్యం చేయడం, పెండ్లి అయిన తర్వా త కూడా పిల్లలను కనడంలో జాప్యం చేయడం, కాన్పుకు కాన్పుకు ఎడం పాటించడం, ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకే శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించాలని సూచించారు. నిరోధ్, ఓపీసీ అనే నోటి మాత్రలు, చాయా, అంతర ఇంజక్షన్లు, ఐయూసీడీ లాంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ వివరాలకు ఏఎన్ఎం/ఆశ కార్యకర్త/ పీహెచ్సీల్లో సంప్రదించాలని తెలిపారు. ఒక్క బిడ్డతో కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికి, అంతర ఇంజక్షన్లు పద్ధతి అవలంబిస్తున్న వారిని లకీ డిప్ ద్వారా ఎంపిక చేసి త్వరలోనే నగదు బహుమతి అందిస్తామని తెలిపారు.
జనాభా స్థిరీకరణ పక్షోత్సవాలు
11వ తేదీ నుంచి ఈ నెల 24 తేదీ దాకా జనాభా స్థిరీకరణ పక్షోత్సవాల్లో భాగంగా కు.ని శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. 16న నందిమేడారం, 19న గర్రెపల్లి, 20న గోదావరిఖని ఏరియా దవాఖాన, 23న బసంత్నగర్లో మగవారికి ఎన్ఎస్వీ శిబిరాలు, 14, 22 తేదీల్లో పెద్దపల్లి జిల్లా దవాఖాన, 17, 24 తేదీల్లో ఏరియా దవాఖాన గోదావరిఖనిలో డీపీఎల్ శిబిరాలు నిర్వహించనున్నామని వివరించారు. అర్హులైన దంపతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కృపాబాయి, నోడల్ అధికారి డాక్టర్ ఫణీంద్ర, డీఎస్వో శ్రీరామ్, డీపీహెచ్ఎన్వో దొరకమ్మ, స్టాటికల్ ఆఫీసర్ సాలమ్మ, డిప్యూటీ డెమో రాజేశం, శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఓదెల, జూలై 11: బాయమ్మపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. పరిమిత కుటుంబంతో అపరిమిత ఆనం దం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కావటి రాజుయాదవ్, సర్పంచ్ తెల్సూరి కొమురయ్య, ఉప సర్పంచ్ సాంబమూర్తి, అంగన్వాడీ టీచర్ స్వర్ణలత, ఆశ కార్యకర్త నీరజ తదితరులున్నారు.