ఓదెల, సెప్టెంబర్ 17: విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సంతోష్ ఆధ్వర్యంలో ఓదెలలోని శ్రీసీతారాంజనేయ ఆల యంలోని వినాయక మండపంలో విశ్వకర్మ భగవాన్కు ప్రత్యేక పూజలు చేశారు. భగవాన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ గౌరవ అధ్యక్షుడు నాగవెల్లి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పెగడపల్లిలో విశ్వకర్మ జెండాను ఎగురవేసి మాట్లాడారు. వేడుకల్లో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరెల్లి సుజాత రమేశ్, ఎంపీటీసీ సుముఖం నిర్మల మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్, సంఘం అధ్యక్షులు నాగుల మల్యాల కోటగిరి చంద్రమౌళి, నాయకులు దోమకొండ శ్రీనివాస్, మియాపురం సతీశ్, నర్సింహాచారి, శ్రీనివాస్, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.
తుర్కలమద్దికుంటలో కార్యాలయం ఎదుట జెండాను సర్పంచ్ ఎగురవేశారు. అలాగే రాగినేడులో విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సంఘం బాధ్యులు భీమోజు సురేందర్, చెల్లోజు రాజేశం, ఈదునూరి వెంకటి,ముత్యాల స్వామి, బ్రాహ్మణపల్లి శంకరయ్య, బాణాల బ్రహ్మచారి, చెల్లోజు తిరుపతి, చెల్లోజు సుదర్శనం, గడ్డం సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని హన్మాన్ ఆలయం ఆవరణలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బొజ్జ నర్సింహాచారి, తాటికొండ రవి, బొజ్జ బుచ్చయ్య, బొజ్జ సత్తయ్య, సంజనపు కేశవ్, మడిపోజు పరమేశ్, తాటికొండ దేవదాసు, బొజ్జ రాజసాగర్, చెన్నోజు బ్రహ్మయ్య, తాటికొండ రాజశేఖర్, తాటికొండ రమేశ్ పాల్గొన్నారు.
యూనిటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ చిత్ర పటానికి శుక్రవారం పూలమాల వేసి, జెండా ఎగురవేశారు.ఇక్కడ వోపా జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, బొజ్జ ప్రకాశం,కాసర్ల శ్రీనివాస్,కొండపాక రామ్మూర్తి ,కట్టా నరేంద్రాచారి, బెజ్జంకి నరేశ్, సత్యనారాయణ,అనిల్,అశోక్ పాల్గొన్నారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆర్ఎఫ్సీఎల్లో జీఎం ప్రాజెక్ట్ వీకే బంగార్ మెకానిక్ వర్క్షాపులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు భద్రత, సంక్షేమం కోసం పూజలు చేశారు.
కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో విశ్వకర్మ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి, పూజలు చేశారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు.