జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆయా కేంద్రాలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా అధికారులు పరిశీలించారు. అర్హులందరూ వేసుకోవాలని సూచించారు.
పాలకుర్తి, సెప్టెంబర్ 17: కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పాలకుర్తి మండలం జయ్యారం, పాలకుర్తిలోని వ్యాక్సినేషన్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. గత బుధవారం అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనికీ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంపై వారిని వివరణ అడిగారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జయ్యారం, పాలకుర్తిలో వ్యాక్సినేషన్ సర్వేపై అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యారాంరెడ్డి, సర్పంచ్ దుర్గం జగన్, ఎంపీటీసీ దుర్గం కుమార్, ఉప సర్పంచ్ మాదాసు సతీశ్, ఎంపీవో షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిలోని ఆర్ ఆర్ గార్డెన్లోని వ్యాక్సినేషన్ కేంద్రా న్ని కలెక్టర్ పరిశీలించారు. 10 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 218 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి టీకా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
12,927 మందికి వ్యాక్సిన్
జిల్లాలో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా శుక్రవారం 184 కేంద్రాల్లో 12,927 మందికి టీకా ఇచ్చినట్లు డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ తెలిపారు.
గోదావరిఖని, సెప్టెంబర్ 17: గోదావరిఖని 42వ డివిజన్ రాజస్థాన్ భవన్లో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. రామగుండం పరిధిలో 54 సెంటర్లలో మొదటి, రెండో డోసు వ్యాక్సినేషన్ వేస్తున్నారని తెలిపారు. ఇక్కడ మేయర్ డా.అనిల్కుమార్, కమిషనర్ శంకర్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు తదితరులు ఉన్నారు.
రామగుండం 48వ డివిజన్లో వ్యాక్సినేషన్ శిబిరాన్ని మేయర్ అనిల్కుమార్, కమిషనర్ పీ ఉదయ్ కుమార్ పరిశీలించారు. ఇక్కడ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిశోర్ కుమార్ ఉన్నారు.
అర్హులందరూ టీకా వేసుకోవాలని డీసీవో, మండల ప్రద్యేకాధికారి మైకేల్ బోస్ సూచించారు. రాఘవాపూర్, ముత్తారం, గుర్రాంపల్లి, చీకురాయి, పెద్దబొంకూర్, తుర్కలమద్దికుంట, కనగర్తి, పాలితం, రాగినేడు, అప్పన్నపేటలో శుక్రవారం కొవిడ్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో సుదర్శన్, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచ్ తంగెళ్ల జయప్రద, సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్రెడ్డి, ఏఎన్ఎం ప్రమీల తదితరులున్నారు.
మంథని మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు అన్ని వార్డుల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. చైర్పర్సన్, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే. రవి, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్రు లింగయ్య, నక్క నాగేంద్ర శంకర్, కాయితీ సమ్మయ్య, శ్రీపతి బానయ్య, కొట్టే పద్మ, హన్మంతరావు, వేముల లక్ష్మి, పెండ్రి రమల ప్రక్రియను పర్యవేక్షించారు.
రామగుండం యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, హెల్త్ అసిస్టెంట్ తిరుపతిరెడ్డి, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు శైలజ, రజిత, భూలక్ష్మి ఉన్నారు. ఎల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 53మందికి టీకాలు ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకాధికారి శ్రీధర్రెడ్డి, ఎంపీడీవో యాదగిరి, కార్యదర్శి అమూల్య, తిరుపతి, అంగన్వాడీ టీచర్ విమల, ఏఎన్ఎం శిరీష ఉన్నారు.
గుండ్లపల్లి, కనగర్తి, పొత్కపల్లి, బాయమ్మపల్లి గ్రామాల్లో జడ్పీ డిప్యూటీ సీఈవో గీత పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి టీకా ప్రాధాన్యత వివరించారు. ఆయా గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు. వెంట ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో వాజిద్ ఉన్నారు.
పట్టణంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను చైర్పర్సన్ సునీత సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యాక్సినేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, నాయకుడు ముత్యం రమేశ్, కౌన్సిలర్ నిషాద్ఫ్రిక్ ఉన్నారు.
మండల కేంద్రంలోని కుర్మపల్లెలో వ్యాక్సినేషన్ నిర్వహణ తీరును ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి పరిశీలించారు. ఇక్కడ సర్పంచ్ దారబోయిన నరసింహం, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఎంపీడీవో వేవణుగోపాల్రావు, కార్యదర్శి లచ్చయ్య ఉన్నారు.
సీతంపేటలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సర్పంచ్ పులిపాక నగేశ్, ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీవో వేణుమాధవ్, ఉప సర్పంచ్ జక్కుల ముత్తయ్య, ఏఎన్ఎం దుర్గ ఉన్నారు.
ముస్త్యాలలో ఇంటింటికీ కొవిడ్ సర్వేలో ఎంపీపీ ఆరెళ్లి దేవక్క పాల్గొని టీకా పంపిణీని పరిశీలించారు.
ఇద్లాపూర్, చిన్నరాత్పల్లిలో వ్యాక్సిన్ కేంద్రాలను సర్పంచులు దొంతరవేన రజిత, దాసరి నవలోక ప్రారంభించారు.