లండన్ : 17వ శతాబ్ధానికి చెందిన రెండు కళ్లజోళ్లు వచ్చే నెల జరిగే వేలంలో దాదాపు రూ 25 కోట్లు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. డైమండ్, ఎమరాల్డ్స్తో చేసిన లెన్స్తో కాంతులీనే కళ్లజోడును సొంతం చేసుకునేందుకు ఔత్సాహికులు పోటీపడనున్నారు. ఈ కళ్లజోళ్లు నిజానికి మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాజ వంశీకులకు చెందినవని వేలాన్ని చేపట్టిన సోత్బే వర్గాలు చెబుతున్నాయి. ఈ కళ్లజోళ్లను ధరించే వారిని ఇవి దుష్టశక్తుల నుంచి కాపాడతాయని, వారికి చైతన్యాన్ని ప్రసాదించేలా ఇవి డిజైన్ చేయబడ్డాయని చెబుతారు.
మొఘలుల జ్యూవెలరీ నైపుణ్యానికి ఈ కళ్లజోడు అరుదైన ఉదాహరణని సోత్బే మధ్యప్రాచ్య, భారత్ చీఫ్ ఎడ్వర్డ్ గిబ్స్ అన్నారు. తమకు తెలిసినంతవరకూ ఇలాంటి కళ్లజోళ్లను పోలినవి మరొకటి లేవని గిబ్స్ తెలిపారు. ఈ కళ్లజోళ్లలోని గ్లాస్ల్లో హాలో ఆఫ్ లైట్గా పేరొందిన ఓ గ్లాస్లో గోల్కొండలోని 200 క్యారెట్ల వజ్రంలోని భాగాలను ఉపయోగించారు. గేట్ ఆఫ్ పారడైజ్గా పిలిచే ఆకుపచ్చ రంగులో ఉండే మరో జోడులోని లెన్సెస్లో కొలంబియా ఎమరాల్డ్ను వాడారు.