ముంబై : గాలి ద్వారా వ్యాపించే అన్ని రకాల కరోనా వైరస్ స్ట్రెయిన్లను దీటుగా నిలువరించే బ్యాటరీ ఆధారిత రీయూజబుల్ మాస్క్ను ముంబైకి చెందిన ఎన్ఎంఐఎంఎస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాస్క్ లోపల ఉండే కాపర్ మెష్ ఎలాంటి కొవిడ్-19 వేరియంట్ల నుంచైనా రక్షణ కల్పిస్తుందని త్వరలో డీమ్డ్ యూనివర్సిటీగా మారనున్న ఎన్ఎంఐఎంఎస్ తెలిపింది. రెండు లేయర్లతో కూడిన ఈ కాటన్ మాస్క్కు 20 మైక్రాన్ల రాగి మెష్ అమర్చబడి ఉంటుంది. దీనికి కాయిన్ బ్యాటరీ ద్వారా 3 వోల్ట్ల సాధారణ ఛార్జింగ్ సరఫరా చేయబడేలా డిజైన్ చేశారు. తాము కనిపెట్టిన మాస్క్ చాలా సింపుల్గా ఉంటూనే ప్రభావవంతంగా పనిచేస్తుందని వర్సిటీకి చెందిన సునందవ్ డివటియో స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ తెలిపారు.
మాస్క్ ఉపరితలాన్ని బ్యాక్టీరియా, వైరస్లు తాకగానే వోల్టేజ్ కారణంగా అవి న్యూట్రలైజ్ అవడంతో పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పారు. ఈ మాస్క్ను చాలా సులభంగా వాడవచ్చని, రీయూజ్ చేయడం, వాష్ చేయడం ఈజీ అని తెలిపారు. ఈ మాస్క్ను సరిగ్గా వాడితే ఆరు నుంచి ఎనిమిది నెలల వరకూ మన్నుతుందని చెప్పారు. మాస్క్ లోపల రూ 30 విలువ చేసే కాయిన్ బ్యాటరీ అమర్చగా ఇన్నర్ ఫిల్డర్ ఏడాది పాటు మన్నుతుందని తెలిపారు. బయటవుండే లేయర్ను 60 సార్లు ఉతకవచ్చని అంటే ఆరునెలల పాటు వాడే అవకావం ఉందని చెప్పారు. సాధారణ మాస్క్లతో పోలిస్తే తమ మాస్క్ ప్రోత్సాహకర ఫలితాలను అందిస్తుందని వర్సిటీ పేర్కొంది.
సాధారణ మాస్క్లు కొద్ది గంటలు వాడిన తర్వాత లోపలి, పై పొరల్లో బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయని తమ మాస్క్ బ్యాక్టీరియా, ఫంగస్ల వృద్ధిని 99 శాతం అడ్డుకుంటుందని తెలిపింది. ఈ మాస్క్ను 17 నుంచి 24 గంటల పాటు నిరంతరంగా వాడిన తర్వాత ల్యాబ్ టెస్ట్లు నిర్వహించగా ఈ మాస్క్పై ఎలాంటి బ్యాక్టీరియాలు వృద్ధి చెందినట్టు గుర్తించలేదని వెల్లడించింది. దీని ధర కూడా తక్కువేనని 300 రోజుల పాటు ఎన్95 మాస్క్లు వాడితే అందుకు రూ 1200 నుంచి రూ 2000 ఖర్చవుతుండగా రూ 600 నుంచి రూ 800 మధ్యన ఏడాది పాటు తమ మాస్క్లను ఉపయోగించవచ్చని వర్సిటీ డీన్ తెలిపారు. ఇక హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్ నుంచి వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ కోసం వేచిచూస్తుండగా మాస్క్ను పెద్దఎత్తున ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యూనివర్సిటీ ఇప్పటికే ఓ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.