పారిస్ : అదృష్టం తలుపుతట్టినా దురదృష్టం వెంటాడితే వారిని ఎవరూ బాగుచేయలేరు. కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ రూ 190 కోట్ల లాటరీని గెలుపొందినా డ్రాకు ముందే వాషింగ్ మెషీన్లో టికెట్ పాడైపోవడంతో కోరివచ్చిన సంపదను చేజేతులా కాలదన్నుకుంది. ఇక తాజాగా జర్మన్ మహిళ ఏకంగా రూ 290 కోట్ల జాక్పాట్ తగిలిన లాటరీ టికెట్ను పర్సులోనే పెట్టుకుని వారాల తరబడి ఆ ఊసే మరిచిపోయింది.
జూన్ 9న లొట్టో 6ఆస్-49 డ్రాలో లోయర్ ఫ్రాంకోనియా (45) కొనుగోలు చేసిన టికెట్ను పర్సులోనే దాచగా అదే టికెట్ లాటరీలో బంపర్ ప్రైజ్ లభించింది. ఆ విషయం తెలియని ఫ్రాంకోనియా ఆరు వారాల తర్వాత మరో లాటరీ టికెట్ కొనుగోలు చేసే క్రమంలో గతంలో తాను కొన్న లాటరీ టికెట్ విషయం గుర్తుకువచ్చింది. డ్రాలో తన పర్సులో దాచిన టికెట్కే జాక్పాట్ తగిలిందని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది.
వారం పాటు ఆమె మిలియనీర్గా చెలామణిలో ఉన్నా ఆ విషయం ఫ్రాంకోనియాకు తెలియలేదు. నెల రోజుల కిందటి టికెట్ను ఆమె లాటరీ అధికారులకు అందించి భారీ ప్రైజ్ను సొంతం చేసుకుంది. 75 ఏండ్ల లొట్టో బేయర్న్ చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం.