హైదరాబాద్: సింగపూర్లో వాసవీ మాత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, భక్త జనులకు అభయ ప్రదాయిని అయిన వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతోత్సవాలను సింగపూర్ ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భౌతికంగా అందరూ ఒక్కచోట లేకపోయినా, ఆన్లైన్ ద్వారా పెనుగొండలోని శ్రీ వాసవి శాంతి ధామ్ క్షేత్రం నుంచి ఈ జయంతోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు.
ఈసందర్భంగా వామ్ సింగపూర్ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ.. వామ్ గ్లోబల్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సమస్త మానవాళికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షించారు.
వామ్ సింగపూర్ సభ్యులు పాలెపు మల్లిక్, కంకిపాటి శశిధర్, వుద్ధగిరి సతీష్లు పెనుగొండలోని దేవాలయ ప్రతినిధుల ప్రత్యేక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. సంకా రవి, కోట సతీష్, కంచర్ల శరత్, పటూరి కిరణ్, నంగునూరి వెంకట రమణ తదితరులు ఈ కార్యక్రమానికి సేవలందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి