హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 దేశాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ భారతం అనే పేరుతో ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న పౌండేషన్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, రాజ్ కమల్ చారిటీస్, అమెరికా సంఘాలు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పది మంది గాయనీమణులు 75 దేశ భక్తి గీతాలను ఆలపించారు. 12 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి జ్యోతి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, నటులు సాయి కుమార్, మాధవపెద్ది సురేష్, ప్రసాద్ తోటకూర, జీవీ నరసింహం, డా. వంగూరి చిట్టెన్ రాజు, రత్న కుమార్ కవుటూరు, సరోజ కొమరవోలు, శ్రీలత మగతల, కల్నల్ కేఆర్కే మోహన్ రావు, లెఫ్టినెంట్ కల్నల్ భాస్కర్ రెడ్డి, విజయ తంగిరాల, జయ పీసపాటి, తాతాజీ ఉసిరికల, దీపిక రావి, విక్రమ్, అనిల్ కుమార్ కందించర్ల, శివ ఎల్లపు, ఎమ్ వి వి సత్యనారాయణ, పృథ్వీరాజ్, వెంకట సురేష్, వేదమూర్తి, ఎస్ డి సుబ్బారావు, వెంకప్ప భాగవతుల, వెంకటేశ్వరరావు తోటకూర, నూనె శ్రీనివాస్, సారథి మోటమర్రి, డాక్టర్ శ్రీదేవి, డోగిపర్తి శంకర్రావు, మధు, సుధామ రెడ్డి, పార్థసారథి, ధన్రాజ్ జనార్ధన్, డాక్టర్ కేఆర్ సురేష్ కుమార్, డాక్టర్ వెంకటపతి తరిగొప్పుల, వేణుగోపాల్ రెడ్డి బోయపల్లి, డాక్టర్ వ్యాస కృష్ణ బూరుగుపల్లి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ కపటపు, ఉపేంద్ర చివుకుల, శారద సింగిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ల, డాక్టర్ శ్రీరామ్ సొంటి, లక్ష్మీ రాయవరపు, గుణ ఎస్ కొమ్మారెడ్డి, లలితా రామ్, శ్రీదేవి జాగర్లమూడి, రమ వనమా, శారద, డాక్టర్ హరి ఇప్పనపల్లి, రాజేష్ ఎక్కల, మల్లిక్ పుచ్చా, జయరామ్ ఎర్రమిల్లి, డాక్టర్ వెంకటా చారి, రాధిక మంగిపూడి, కళ్యాణి, సింగింగ్ స్టార్ విజయలక్ష్మి, హేమవతి, బీవీఎల్ఎన్ పద్మావతి, వీకే దుర్గ, మాధవీ రావూరు, సుజా రమణ, సుందరి, లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు, తెన్నేటి సుధా దేవి, శైలజ సుంకరపల్లి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికర్డ్స్లో నమోదయ్యిందని వంశీ రామరాజు తెలిపారు.