హైదరాబాద్ : సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. మన పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా వేడుకలకు చేయూత నందించిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జూలూరి సంతోష్ కుమార్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, నంగునూరి సౌజన్య, శివ ఆవుల వ్యవరించారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహాత్య