హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం ఉందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. త్వరలోనే తమ ప్రచార షెడ్యూల్ ని ప్రకటిస్తామని గుర్రాల నాగరాజు తెలిపారు.