హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు టీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. పదవులను తృణపాయంగా వదిలేసి, ఒక్క అడుగుతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో పాల్గొంటున్న నాయకులకు, కార్యకర్తలకు మహిపల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.