హైదరాబాద్ : దివంగత ప్రముఖ గాయకుడు బాలు పాటకు అమెరికాలో పట్టాభిషేకం జరిగింది.
వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా – తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ – శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75 వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులచే 75 పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం చేశారు. ఆదివారం 13 జూన్ సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 :00 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్ అంతర్జాలం వేదికగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంతోష్ ఫిలిం న్యూస్. ట్రినెట్, తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ప్రసారమైంది.
అతిథులుగా, సినీ దర్శకులడు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు, మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, రవిప్రకాష్, యూకే నుంకచి డా. నగేష్ చెన్నుపాటి, సురేష్ కొండేటి, ఒమన్ నుంచి, హరి వేణుగోపాల్, వంశీ రామరాజు పాల్గొన్నారు.
కాగా, గాయకులు రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం శ్రీ సాందీప్. పవన్ చరణ్, హరి గుంట , విపంచి శశిధర్, ధనుంజయ్ బాలు గారి 75 పాటలను వీనులవిందుగా వినిపించనున్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే