హైదరాబాద్ : అమెరికాకు చెందిన మానవతావాది, గాయకుడు శ్రీనివాస్ వడ్లమానిని వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సాస్ వారు వారి 95వ ప్రచురణగా ముద్రించిన ‘లిటిల్ డిటెక్టివ్’ నవల ముద్రణకు శ్రీనివాస్ వడ్లమాని, లక్ష్మీ పద్మజ వడ్లమాని సహకరించారని, లిటిల్ డిటెక్టివ్ నవలా రచయిత్రి, పూర్వ సెన్సార్ బోర్డు మెంబర్, డాక్టర్ తెన్నేటి సుధాదేవి తెలిపారు.
ఈ మేరకు ‘లిటిల్ డిటెక్టివ్’ నవలను వారికి బహకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ సంస్థల అధినేత డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. శ్రీనివాస్ వడ్లమాని మాతృభాషను, మాతృదేశాన్ని మరవకుండా తెలుగు భాషకు చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.
అలాగే వంశీ వేగేశ్న ఫౌండేషన్ ఆశ్రమాలలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని, షిరిడి సాయిబాబా దేవాలయాన్ని, ఘంటసాల గుడిని, దివ్యాంగుల ఆశ్రమాన్ని, సందర్శించి, వేగేశ్న ఫౌండేషన్ చెయిర్ పర్సన్, వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ, శైలజ సుంకరపల్లి సేవలను శ్రీనివాస్ అభినందించారు.
స్వర్ణోత్సవాలలోకి అడుగిడుతున్న వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా ఇస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని శ్రీనివాస్ అన్నారు.