హైదరాబాద్ : రుషిపీఠం ఆధ్వర్యంలో అక్టోబర్ 30న కింగ్కోఠిలోని భారతీయ విద్యాభవన్లో ‘శ్రీ లలితావిద్య’ ఆవిష్కరణోత్సవం జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు నాట్య గురువులు నూతి లక్ష్మీప్రసూన బృందంచే ‘వన్ దే శ్రీమాతరం’ పేరుతో ప్రత్యేక ‘శివపద’ నృత్యంతో కార్యక్రమం ప్రారంభం కానుంది. ‘భాగవతవిరించి’ డా. టి.వి.నారాయణరావు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
కాంచీపురం కంచికామకోటిపీఠం శ్రీకార్యం ఏజెంట్, చల్లా విశ్వనాథశాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. ‘మధురభారతి’ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గ్రంథ సమీక్ష చేస్తారు.
‘జ్ఞానానందనాథ’ గోటేటి శ్రీనివాసరావు ప్రథమ ప్రతిని స్వీకరిస్తారు. గ్రంథకర్త సామవేదం షణ్ముఖశర్మ హృదయావిష్కారం చేస్తారు. కాగా, శ్రీలలితసహస్రనామస్తోత్రంపై సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలను ఒక గ్రంథంగా శ్రీ లలితావిద్య రూపొందించారు.