తెలంగాణ లో ఎన్నిక ఏదైనా ప్రజలంతా ఎప్పుడు టీఆరెస్ వైపే అన్నది ప్రజలు మరొక్కసారి నిరూపించారని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అద్భుతమైన పాలనను చూసి ప్రజలు మరో సారి ఆశీర్వదించారని, అందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటించారు.
జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 12 స్థానాలకు 12 స్థానాలనూ టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం చాల సంతసకరమైన విషయమని, టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం అందించారన్నారని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ ఎన్నారై తెరాస సెల్ బహరేన్ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నామని సతీశ్ కుమార్ పేర్కొన్నారు.