లండన్: తెలంగాణ అసోసియన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) కో ఆర్డినేటర్గా యాదాద్రి యువకుడు నియమితులయ్యారు. జిల్లాలోని ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన మామిడాల ప్రశాంత్ను టాక్ ఎన్నారై స్టుడెంట్ కో ఆర్డినేటర్గా నియమిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు కుడుదుల రత్నాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా టాక్ సంస్థకు, ప్రవాస విద్యార్థులకు వారధిగా పనిచేస్తానని ప్రశాంత్ అన్నారు. కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు రత్నాకర్కు కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..