హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభంకానుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారని అనిల్ తెలిపారు.
దళితుల సాధికారత కోసం తెచ్చిన తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఎన్నారైలంతా హర్షిస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని అనిల్ కూర్మాచలం తెలిపారు. నాడు హుజురాబాద్ లో రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, అలాగే తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభానికి కూడా హాజరవుతానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ