లండన్ : తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న మంత్రి కేటీఆర్పై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరును టీఆర్ఎస్ ఎస్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తప్పుబట్టారు. వైట్, బ్లాక్ ఛాలెంజ్ కాదని.. రేవంత్కు దమ్మూ, ధైర్యం ఉంటే అభివృద్ధి (Development) ఛాలెంజ్ను స్వీకరించాలని సవాల్ విసిరారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన విమర్శలను ఎన్నారై శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన నాయకుడని అన్నారు.
మంత్రి కేటీఆర్ను విమర్శించే నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ఇన్నేండ్లు ఏం చేశావో ప్రజలకు చెప్పాలని అనిల్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. బాధ్యతగల స్థానంలో ఉండి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎంత సేపు వ్యక్తిగత దూషణలతో ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యాడని అన్నారు. ఈ ధోరణిని ఎన్నారైలు సైతం అసహ్యించుకుంటున్నారని అనిల్ తెలిపారు.
ఇప్పటికైనా రేవంత్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇలాగే మంత్రుల మీద, నాయకుల మీద పిచ్చి విమర్శలు చేస్తే తప్పకుండా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సత్య నాదెళ్ల ఎవరో కూడా తెలియని జ్ఞానం లేని చరిత్ర నీది, కానీ అదే సత్య నాదెళ్లతో ప్రశంసలందుకున్న చరిత్ర మంత్రి కేటీఆర్దని, ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. ఎవరి స్థాయి ఏందో ప్రజలకు తెలవడానికి ఇది చాలన్నారు. పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవని ప్రపంచానికి తెలువదా అన్ని ఎద్దేవా చేశారు.