హైదరాబాద్ : కరోనా బారిన పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరపున ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు సీఎం కేసీఆర్కు శ్రీరామ రక్షగా ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పం ముందు కరోనా చాలా చిన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు మహేష్ బిగాల పేర్కొన్నారు.