హైదరాబాద్ : వెలివాడల బతుకులకు ఆర్థిక పునర్జీవనాన్ని కల్పించి దళిత సోదరులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత యజ్ఞానికి పూనుకున్నారు. ఈ రోజు హుజురాబాద్లో దళితబంధు పథకాన్ని సీఎం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందన్నారు. చారిత్రాత్మకమైన సందర్భానికి తెరలేపిన దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
ఈ నిర్ణయం దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ బాట పట్టడం ఖాయమని ఆయన అన్నారు. ఈ పథకంతో దళితుల్లో నూతన క్రాంతి వెల్లివిరుస్తుందన్నారు. అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ఆయన కృజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాకాల సరస్సు నుంచి కొట్టుకొచ్చిన మొసలి
Dalit Bandhu | కాంగ్రెస్ అక్కసు.. దళితులను అడ్డుకున్న హస్తం నేతలు