హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఖతర్లో ఘనంగా నిర్వహించారు. TRS ఖతర్ ఆధ్వర్యంలో దోహాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖతర్ యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట కేక్ కట్ చేశారు. మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పార్లమెంట్ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో TRS ఖతర్ సీనియర్ నాయకులు శంకర్ సుందరగిరి, ఎల్లయ్య తాళ్ళపెళ్లి, శంకరా చారి బొప్పరపు, రాజు గౌడ్ సుందరగరి, సంజు థామస్, రాజి రెడ్డి, అరుణ్ అలిశెట్టి, పెరుమాండ్ల రవి, హాల్లారి శ్రీను, ప్రసాద్, ముల్లె ప్రభాకర్, హరీష్ రాథోడ్ పాల్గొన్నారు.